మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఆలయాలకు పెద్దఎత్తున తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసదీక్షలు చేపట్టి సాయంత్రం పండ్లు, ఫలాలతో దీక్షలు విరమించారు. ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పలువురు ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
– సంగారెడ్డి/మెదక్, న్యూస్నెట్వర్క్, ఫిబ్రవరి 18
మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట/ పెద్దశంకరంపేట/ రామాయంపేట/ చేగుంట/ నిజాంపేట/ నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని శనివారం జిల్లాలో ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు సాయంత్రం ఆలయాలకు వెళ్లి తులసి, మారేడు పత్రాలతో శివుడికి అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్షలను విరమించారు. రాత్రి జాగరణ చేస్తూ శివనామ స్మరణలో గడిపారు. మెదక్ మండలంలోని శైవ కేత్రాలు భక్తులతో కిటకిటలాడయి. మంబోజిపల్లిలోని కొయ్యగుట్టపై మల్లన్నస్వామి అలయంలో రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు చేశారు. పేరూరులోని గరుడ గంగ సరస్వతి, శివాలయాల్లో శివ పార్వతుల కల్యాణం, మహాహారతి నిర్వహించారు.
చిన్నశంకరంపేటలో సోమేశ్వరస్వామి జాతర
చిన్నశంకరంపేట మండలకేంద్రంలోని సోమేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం గా గణపతి పూజ నిర్వహించారు. రుద్రారంలో సంగమేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.
శివనామ స్మరణతో మార్మోగిన కొప్పోల్ దేవాలయం
పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోల్లోని ఉమాసంగమేశ్వర ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. స్వామివారికి అన్నపూజ, అభిషేకాలు, యజ్ఞం, లక్షబిల్వార్చన, హ రతి, సహస్ర నామార్చన నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఆవాహిత మండప దేవతాపూజ, రుద్రహవనం, రుద్రాభిషేకం చేపట్టారు. జాతరలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా తహసీల్దార్ చరణ్, ఎస్స్సై బాల్రాజు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొప్పోల్ ఉమాసంగమేశ్వరుడి దర్శనానికి పెద్దశంకరంపేట తోపాటు టేక్మాల్, పాపన్నపేట, అల్లాదుర్గం, రేగోడ్, కల్హేర్, నారాయణఖేడ్ మండలాల నుంచి శివస్వాములు తరలివచ్చారు.గురుస్వాముల సమక్షంలో ఇరుముడులు స్వామి వారికి సమర్పించి మాల వితరణ చేశారు. కార్యక్రమంలో పూజారులు అనంతరాజ్, సంగప్ప పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట పట్టణ శివారులోని గురుపాదగుట్ట శివాలయం, గొట్టిముక్కుల రాజుల గుట్టపై వెలిసిన శివలింగం, విఠలేశ్వర ఆలయం, టెంకటిలోని కాశీ విశ్వేశ్వరాలయంలో భక్తులు పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమించారు.
ఆలయాల్లో పోటెత్తిన భక్తులు
రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప, మార్కండేయ, వేంకటేశ్వర, దత్తాత్రేయ, సీతయ్య, రాజరాజేశ్వర ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, సౌమ్య దంపతులు, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, మమత, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పుష్ప దంపతులు ఆలయా ల్లో పూజలు చేశారు. మార్కండేయంలో పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ, కళావతి దంపతులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. కాట్రియాల, లక్ష్మాపూర్, అక్కన్నపేట తదితర గ్రామాల్లో భక్తులు పూజలు చేశారు.
గ్రామాల్లో శివనామస్మరణ…
చేగుంట, నార్సింగి మండలాల్లో శివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శివాలయాల్లో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేసి, ఉపవాస దీక్ష విడిచారు.
వైభవంగా మల్లికార్జునస్వామి కల్యాణం
నిజాంపేట మండలం నందిగామలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు.
భ్రమరాంభిక మల్లికార్జున ఆలయంలో
నర్సాపూర్ మండలంలోని గొల్లపల్లిలో శివకేతకి భ్రమరాంభిక మల్లికార్జునస్వామి ఆలయంలో గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాధామల్లేశ్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు.
శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం
కొల్చారం మండల కేంద్రంలోని వీరభద్ర దేవాలయం, శివాలయం, రంగంపేటలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస దీక్షలు విడిచారు. పలు దేవాలయాల వద్ద ఉపవాస దీక్షలు ఉన్నవారికి పండ్లను పంపిణీ చేశారు. శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.
రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు
చిలిపిచెడ్ మండలం చండూర్లో రామలింగేశ్వరస్వామి ఆలయ ఉత్సవాలు కొనసాగుతున్నయి. ప్రధాన అర్చకుడు మురళీధర్శర్మ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతా లు, అమ్మవారికి ఒడిబియ్యం, ప్రసాద పంపిణీ, శివపార్వతు ల కల్యాణం, శివస్వాముల దీక్షవిరమణ చేపట్టారు. ఆదివా రం సాయంత్రం బండ్ల ఊరేగింపు, అన్నదానం, రాత్రి సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పాచిబండ్ల ఊరేంగిపు, సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ స్వాతీజగన్మోహన్రెడ్డి తెలిపారు.