శివ్వంపేట, అక్టోబర్ 9 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం ‘మన ఊరు -మనబడి’ కింద మంజూరైన చండీ గ్రామంలో రూ. 80లక్షలు, గోమారంలో రూ. 61లక్షలతో ప్రహరీ, తిమ్మాపూర్లో రూ. 36లక్షల నిధులు పనులు పూర్తి కాగా, పాంబండలో గ్రామపంచాయతీ భవనానికి రూ. 18లక్షలు, రూ. 10లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, ‘మన ఊరు -మనబడి’ కింద రూ. 45 లక్షలతో నిర్మించిన ప్రహరీని ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు -మనబడి’ పథకంతో ప్రతి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పాఠశాలలకు ప్రహరీ, కిచెన్షెడ్, మరుగుదొడ్లు, హ్యాండ్వాష్, ఫ్యాన్లు,బెంచీలు, డైనింగ్హాల్ తో పాటు అన్ని వసతులు కల్పించామన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషించారని సర్పంచ్లను అభినందించారు.
ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, ఎంపీడీవో భారతి, ఎంఈవో బుచ్యానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచ్లు లావణ్యమాధవరెడ్డి, ఉమాఅనిల్ప్రసాద్రెడ్డి, అనూష అశోక్గౌడ్, తలారి శివులు, చంద్రకళాశ్రీశైలంయాదవ్, ఎడ్ల హరికిషన్రావు, నాయకులు బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, కో-ఆప్షన్ సభ్యులు లాయక్, బీసీసెల్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, యువత అధ్యక్షుడు పవన్గుప్తా, యాదాగౌడ్, రాజశేఖర్గౌడ్, సంజీవచారి, ముత్యంరెడ్డి, నవీన్గౌడ్ తదితరులు ఉన్నారు.