సిద్దిపేట, ఏప్రిల్ 7: రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే ఒక స్థానం కూడా మాలలకు కేటాయించకపోవడం బీజేపీకి మాలలపై ఎంత ద్వేషం ఉందో తెలుసుకోవచ్చని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేశ్ అన్నారు.
మాలలకు బీజేపీ ఒక పార్లమెంట్ స్థానాన్ని కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పాతబస్టాండ్ వద్ద ఆదివారం మాలమహానాడు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, నర్సింహులు, ఎల్లేశ్, బాబు, సందీప్ పాల్గొన్నారు.