సదాశివపేట, మార్చి 21: పట్టణంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువవుతున్నది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. గురువారం పట్టణంలోని రహమత్నగర్, ఫయాజ్నగర్ కాలనీలో చిన్నారులు, మహిళలపై పిచ్చికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. పిచ్చి కుక్కలు చేసిన దాడిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.