తూప్రాన్, ఏప్రిల్ 17: తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో రథోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. నూతనంగా చేయించిన రథములో సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు తూప్రాన్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్గౌడ్ హల్దీవాగు చెక్ డ్యాం వద్దకు స్వామివారి పల్లకి మోసి, సతీ సమేతంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను చక్రస్నానం చేయించారు. రామాలయం వద్ద ఉప్పల నర్సింహులు గుప్తా, ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, నాయకులు బొంది వెంకట్ గౌడ్, తలారి మల్లేష్, దుర్గారెడ్డి, రవీందర్ గుప్తా, సత్యలింగం, రాజేశ్వర్శర్మ, ఆత్రేయ శర్మ, మనోహర్ పాల్గొన్నారు.