పటాన్చెరు, డిసెంబర్ 31: అన్ని రంగాల్లో మినీ ఇండియా ముందున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో నియోజకవర్గంలోని అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, రహదారి భవనాలు, గ్రామీణ నీటి పారుదలశాఖల జిల్లా అధికారులతో, బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వెళ్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.72 కోట్ల 97లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
పంచాయతీరాజ్శాఖ ద్వారా 32 పనుల కోసం రూ.23 కోట్ల 76లక్షలు మంజూరు అయ్యాయని, వీటితో బీటీ రోడ్లు రెన్యువల్ చేయడంతో పాటు వివిధ బ్రిడ్జిలను నిర్మాణం చేస్తున్నామన్నారు. జిన్నారం మండలంలో రూ. కోటి 56లక్షలతో ప్రాథమిక వైద్యారోగ్యకేంద్రం నిర్మాణ పనులను రెండు రోజుల్లో ప్రారంభిస్తున్నామన్నారు. రూ.5కోట్ల 16లక్షలతో మిషన్ భగీరథ నిధులతో పటాన్చెరు, జిన్నారం, అమీన్ఫూర్ మండలాల పరిధిలో ఓవర్హెడ్ ట్యాంక్లను, పైప్లైన్ల నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు. రహదారులు, భవనాలశాఖ ద్వారా రూ.17 కోట్ల 70లక్షలతో బీటీ రోడ్లను మరమ్మతు చేయనున్నట్టు పేర్కొన్నారు.
‘మనఊరు-మనబడి’కి రూ.20.14కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి రూ.20.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు. వీటితో 56 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. మార్చిలో అన్ని పనులు దాదాపుగా పూర్తి అవుతాయన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ సైప్లెద్వారా రూ.9 కోట్ల అంచనాతో పటాన్చెరు పోలీస్స్టేషన్ నుంచి రిలయన్స్ కంపెనీ వరకు నూతన పైప్లైన్లను వేశామన్నారు. సీఎం కేసీఆర్ నారాయణ్ఖేడ్లో ప్రకటించిన మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల నిధులను మంజూరు చేశారని, వాటితో జరుగుతున్న పనులను త్వరలోనే వివరిస్తామన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో ఒకవైపు, పరిశ్రమలు ఇస్తున్న సీఎస్సార్ నిధులతో మరోపక్క వేల కోట్లతో పనులు పారదర్శకంగా చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో పారిశ్రామికరంగం, ఐటీ, రియాల్టీ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దీనికి పటాన్చెరు నియోజకవర్గమే నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. అమీన్ఫూర్, తెల్లాపూర్లలో వందల సంఖ్యలో కొత్త కాలనీలు, గ్రేటర్ కమ్యూనిటీలు వచ్చాయన్నారు.
మినీ ఇండియాకు మహర్దశ
పటాన్చెరు అంటే మినీ ఇండియా అని పిలుస్తారని గుర్తు చేశారు. 28 రాష్ర్టాల ప్రజలున్న మినీ ఇండియాలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పొట్టకూటికోసం వస్తున్నవారికి ఆదరించి అన్నం పెడుతున్నామన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ సమాన అవకాశాలు ఇస్తున్నామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందజేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. స్పోర్ట్స్ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదు ఎకరాల స్థలాలు కేటాయించి పాటి, జిన్నారం, అమీన్పూర్లలో మినీ స్టేడియాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతిత్వరలో రిజిస్ట్రేషన్శాఖ పటాన్చెరు రాబోతున్నదన్నారు. మూడో విడుతలో మెట్రో రైలు ఇస్నాపూర్ వరకు ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రశ్నిస్తే దాడులా.?
ప్రజాస్వామ్యంలో పెనుముప్పులా బీజేపీ మారుతున్నదని ఎమ్మెల్యే అన్నారు. అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పకుండా బీజేపీ ఈడీలు, దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. మెనిఫెస్టోలతో, అభివృద్ధి ఎజెండాలతో ముందుకు పోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపీ లాడ్స్ నిధులను రద్దు చేసిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ దేశంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు ఈర్ల దేవానంద్, సుష్మశ్రీ, కార్పొరేటర్లు పుష్ప, మెట్టు కుమార్యాదవ్, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రారెడ్డి, నగేశ్, వెంకటేశంగౌడ్, దశరథరెడ్డి, బీ.వెంకట్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బీ.పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, సోమిరెడ్డి, పరమేశ్యాదవ్, చంద్రారెడ్డి, పంచాయతీరాజ్శాఖ ఏఈ జగదీశ్వర్, ఆర్అండ్బీ శాఖ ఈఈ సురేశ్, ఆర్డబ్ల్యూఎస్శాఖ డీఈ శ్రీనివాస్, గూడెం మధుసూదన్రెడ్డి, వడ్డేకుమార్, మాణిక్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.