అభివృద్ధి, సంక్షేమ పాలన చేసిన బీఆర్ఎస్ వైపే అన్నివర్గాల ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లిలో వివిధ పార్టీల నుంచి 50మంది యువకులు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కోసం పనిచేసేందుకు యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలో ఎంతో ప్రగతిని సాధించుకొని, దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని సృష్టం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. దుబ్బాక నుంచి భారీ మెజార్టీ సాధించి సీఎం కేసీఆక్కు కానుకగా ఇవ్వాలని యువకులకు పిలుపునిచ్చారు.
– చేగుంట, అక్టోబర్ 14
చేగుంట, అక్టోబర్ 14: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట మండలంలోని కర్నాల్పల్లి గ్రామానికి చెందిన ఇతర పార్టీల 50 మంది నా యకులు దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో నే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రైతులు అభివృద్ధి చెందాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, 24గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తుందన్నారన్నారు. చేనేత, గీత, బీడీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించిందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తుందన్నారు.
పేదల వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానలను మెరుగు పరుచడంతో అన్ని విధాల వైద్య సేవలు అందిస్తామన్నారు. గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి వెళ్లేందుకు రహదారులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారలోకి వస్తుందని, ప్రతి కార్యకర్త పార్టీకోసం కలిసీ కట్టుగా పనిచేసి,ప్రభుత్వ పథకాలను,ప్రతి కార్యకర్త ఇంటింటికి తీసుకెళ్లి,విపక్షాల కల్లబోల్లి మాటలను తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గణపురం సంతోష్రెడ్డి, ఉప సర్పంచ్ పొన్నాల భూపతి, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్రెడ్డి,బీఆర్ఎస్ మండల నాయకులు వంటరి అశోక్రెడ్డి,బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వంటరి లోకేష్రెడ్డి,వార్డు సభ్యులు అంజిరెడ్డి,ఎం కిష్టయ్య,నాయకులు చింతాకుల శేఖర్, యెర్వ సునిల్రెడ్డి, సత్తిరెడ్డి, బుచ్చంగారి యశ్వంత్రెడ్డి, నవీన్రెడ్డి, కె.రమేశ్, యూత్ సభ్యులు దుర్గప్రసాద్,బీ సాయిదీప్,జె నవీన్, ఇమ్రాన్, వీరేశ్గౌడ్, బబుల్గౌడ్, వీరేందర్ తదితరులు ఉన్నారు.