అమీన్పూర్/ గుమ్మడిదల, అక్టోబర్ 29 : తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి హాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాం డురంగారెడ్డి అధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకు లు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోట్ల భాస్కర్రెడ్డితోపాటు 100మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, తెలం గాణను ఆదర్శంగా నిలిపారన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణలో ప్రతి ఇంటి అశీస్సులు ఉన్నాయని, ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉంటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ నర్సింహగౌడ్, కౌన్సిలర్లు కృష్ణ, కల్పనాఉపేందర్రెడ్డి, కవితాశ్రీనివాస్రెడ్డి, బీజీలి రాజు పాల్గొన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, పటాన్చెరులో ఎమ్మెల్యే మ హిపాల్రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితుడయ్యాను. సీఎం కేసీఆర్ ఉండగా తెలంగాణలో మరో పార్టీకి అవకాశం లేదు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రాష్ర్టాన్ని అభివృద్ధ్ది చేస్తున్నా రన్నారు. కండ్ల ముందు అభివృద్ధి కనిపిస్తుండడంతో బీఆర్ఎస్లో చేరానన్నారు. బీఆర్ఎస్ విజయానికి పని చేసి మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్
సెంచరీ మనదే.. సర్కారు మనదే..
గుమ్మడిదల మండలం దోమడుగు, బొంతపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్లో చేరారు. ముందుగా బీఆర్ఎస్ శ్రేణులు దోమడుగు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్రెడ్డి, జైపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, రమేశ్, బాబూరావు, హరీశ్, ప్రశాంత్, శివకుమార్, కిషన్సింగ్తోపాటు దాదాపు 200 మంది కాంగ్రెస్, బీజేపీకి చెం దిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లు సాధించి సర్కారు ఏర్పాటు చేస్తుందన్నారు. 60 ఏండ్లలో సాధించని అభివృద్ధిని కేవలం పదేండ్ల కాలంలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్ధి ప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, సురేందర్రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, సంతోష్రెడ్డి, పొన్నబోయిన వేణు, సర్పంచ్ రాజశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, గ్రామశాఖ అధ్యక్షుడు మురళీ, నాయకులు కిశోర్, శ్రీనివాస్గౌడ్, మద్ద్ధిశేఖర్రెడ్డి, భాస్కర్రెడ్డి, రాంప్రసాద్, రాంరెడ్డి, సంజీవరెడ్డి, ఇజాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.