మెదక్, జూలై 7(నమస్తే తెలంగాణ) : మెదక్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని మెదక్, చిన్నశంకరంపేట మండలాల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో వంద కార్లల్లో ర్యాలీగా తెలంగాణ భవన్కు తరలివెళ్లి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారని తెలిపారు. పలు కారణాలతో ఉద్యమపార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా, ఆయా పార్టీల్లో ఇముడలేక యూటర్న్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. ఉద్యమ పార్టీగా ఏర్పాటైన రోజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన చాలామంది నేతలు ఆ తర్వాత పార్టీని వీడారని, ప్రస్తుతం ఆ నేతలంతా మళ్లీ సొంతగూటికి చేరుతున్నారని తెలిపారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ సీఎంగా కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నారాజై వెళ్లిన నాయకులు మళ్లీ సొంతగూటికి (బీఆర్ఎస్ పార్టీకి) రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. 19 నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి దూరం ఉండి అనేక సమస్యలు ఎదురొన్నారని వాపోయారు. అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మళ్లీ మెదక్ నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. 19 నెలల్లో ఎమ్మెల్యే రోహిత్ అభివృద్ధి చేయక మెదక్ నియోజకవర్గం కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ నుంచి వస్తున్న జీవన్రావు, గంగా నరేందర్, ఇతర నాయకుల ముఖంలో సంతోషం కనిపిస్తుందని, వాళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది జీవన్రావు, గంగా నరేందర్ మాట్లాడుతూ… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు వల్ల మేము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మార్పు పేరు మీద మెదక్లో దోపిడీ ప్రారంభమైందని, 19 నెలలుగా మేము అనేక రకాలుగా ఇబ్బందులు, సమస్యలు ఎదురొన్నామని వాపోయారు. ఆత్మగౌరవం మర్యాద లేని పరిస్థితుల్లో ఉన్నామని, గెలిచిన రెండు నెలల నుంచి పార్టీ కోసం పనిచేసినా ఏఒక వ్యక్తికి ఆదరణ లేదని, కనీస మర్యాద, గౌరవం కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురొన్నామని, అప్పుడే పుట్టిన పాప తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో అదేవిధంగా తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందనే భావనతో మేము చేసిన పొరపాటు వల్ల మెదక్ ప్రజలకు క్షమాపణ కోరుతున్నామన్నారు. ఈ రోజు సొంతగూటికి బీఆర్ఎస్లోకి వస్తున్న సందర్భంగా గులాబీ పార్టీ కుటుంబ సభ్యులకు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి శిరస్సు వంచి నమసారాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
మళ్లీ పూర్వ వైభవం దిశగా పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ను తీసుకెళ్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, జుబర్ అహ్మద్, సాయిలు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఆరే శ్రీనివాస్, జయరాజ్, చంద్రకళ, మాయ. మల్లేశం, మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, నిజాంపేట మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు అంజాగౌడ్, పట్లోరి రాజు, విష్ణువర్ధన్రెడ్డి, సుధాకర్రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మెదక్ పట్టణ, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.