కొండాపూర్, జూన్ 12 : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు గ్రామపంచాయతీలు మినహాయించి 22 గ్రామపంచాయతీల్లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. తొమ్మిది రోజుల క్రితం గంగారం రెవెన్యూ గ్రామంలో ఎకరం వరకు కొందరు రైతులు పాత రిజిస్ట్రేషన్ ఫీజులో స్లాట్ బుక్ చేసుకున్నారు. అంతకుముందు రూ. 2 లక్షల 20 వేలకు పైన ఉన్న భూముల విలువలకు అనుగుణంగా బుక్ చేసుకున్నారు. గత శుక్రవారం అదే భూముల రేట్ల విలువ అమాంతం రూ. 10 లక్షలకు పెంచడంతో ఆ రైతులు అవాక్కయ్యారు.
రెండున్నరేండ్ల నుంచి రియల్ ఎస్టేట్ కుదేలవ్వడంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ రియల్ వ్యాపారులు భూములు కొనాలంటే కొనుగోలు చేయవచ్చేమో కానీ, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ విషయమై కొండాపూర్ తహసీల్దార్ అశోక్ను వివరణ కోరగా ప్రభు త్వం నూతనంగా పెంచిన భూముల విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇంత కుముందున్న స్లాట్ను తిరిగి రెన్యూవల్ చేయించుకుని అంతకుముందు కట్టిన డబ్బులకు అదనంగా ఎన్ని డబ్బులు చెల్లించాలనేది ఆన్లైన్లోనే తెలుస్తుందన్నారు. ఆ లెక్కల ప్రకారం ఫీజులు చెల్లించాలని ఆయన చూచించారు.