మెదక్కు త్వరలో ఔటర్ రింగ్రోడ్డు అందుబాటులోకి రానున్నదని, రూ.305 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ హేమలతతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో జిల్లా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి భవన నిర్మాణాల కోసం రూ.180 కోట్లు విడుదల చేశారన్నారు. ఏడుపాయలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది 5 కోట్ల చేపవిత్తనాలను నీటి వనరుల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. రెండో విడుత దళితబంధు కింద ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు కేటాయించామన్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 17
మెదక్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): 1948 సెప్టెంబర్ 17 అంటే 75 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన రోజని, అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రకటించారని రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్య్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్భంగా ఆదివారం నూతన కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ జాతీయ పతాకావిషరణ గావించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల కళాశాల మంజూరు చేసి భవనాల నిర్మాణాలకు రూ.
180 కోట్లు, ఏడుపాయల క్షేత్రానికి రూ.100 కోట్లు మంజూరు చేశారని, బతుకమ్మ పండుగకు చీరాల పంపిణీ, పల్లెప్రకృతి వనాలు, చివరి గమ్యం చేరడానికి వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, కాకతీయ మిషన్ ద్వారా భూగర్భ జలాలు పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు. రూ.305 కోట్లతో మెదక్ ఔటర్ రింగ్రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున మంజూరు చేసిందని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా స్వయం పరిపాలనకు అద్భుతమైన నూతన సమీకృత కార్యాలయాల సముదాయాలు, ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. 2014కి ముందున్న ప్రభుత్వాలు పట్టణాల అభివృద్ధికి ఎటువంటి నిధులు మంజూరు ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు.
ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2001లో ప్రారంభించి, సుమారు 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపిస్తూ, ప్రజలందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అనతికాలంలోనే అద్భుత ప్రగతిని సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో సాగుతున్నదన్నారు.
మెదక్ జిల్లాలో 3 రిజర్వాయర్లు, ప్రాజెక్టులతో సహా మొత్తం 1617 చెరువులున్నాయి. జిల్లాలో 279 మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల్లో 16,200 మంది సభ్యులున్నారు. మత్య్సకారుల అభివృద్ధికి జిల్లాలో చేప పిల్లల విత్తనాల ఉత్పత్తి కేంద్రం స్థాపించారు. 2023-24కి గానూ 5 కోట్ల చేప విత్తనాలను జిల్లాలోని వివిధ నీటి వనరుల్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.
తెలంగాణ దళితబంధు పథకం ద్వారా జిల్లాలో మొదటి విడతలో 256 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున రూ.25 కోట్ల 60 లక్షలు పంపిణీ చేశారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం 328 మంది లబ్ధిదారులకు గానూ రూ.5కోట్ల 88 లక్షలు మంజూరు చేశారు. పాడి గేదెల పథకం కింద అందోల్కు 300 యూనిట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 166 యూనిట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
మెదక్ జిల్లాలో గొర్రెల అభివృద్ధి పథ కం మొదటి విడత కింద 12,997 గొర్రెల యూనిట్లను రూ.128 కోట్ల 37 లక్షల సి బ్సిడీతో పంపిణీ చేశామని మంత్రి తలసా ని తెలిపారు. రెండో విడత కింద 7184 గొర్రెల యూనిట్లకు ఇప్పటి వరకు 2579 మంది లబ్ధిదారులు వర్చువల్ ఐడీల ద్వారా లబ్ధిదారుడి వాటా చెల్లించారు. ఇప్పటి వరకు 456 మంది లబ్ధిదారులకు 75శాతం సబ్సిడీతో 21గొర్రెల యూ నిట్లను పంపిణీ చేశారు. ఇందులో 210 గొర్రెల యూనిట్ల లబ్ధిదారులకు 100 కిలోల దాణా, మెడికల్ కిట్లు పంపి ణీ చేశారు. పాడి పశువుల పంపిణీ పథ కం కింద 1199 పాడి పశువులను రూ.5 కోట్ల 44లక్షల సబ్సిడీతో పంపిణీ చేసినట్లు వివరించారు. పశువులు రోగాల భారిన పడకుండా ముందు జాగ్రత్తల్లో భాగంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.
– పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
30 ఎకరాల్లో రూ.180 కోట్లతో మెదక్లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. త్వరలోనే ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు మెడికల్ కళాశాల పనులు ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నూతన సమీకృత కలెక్టేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఏ పనులు ఉన్నా సంగారెడ్డికి వెళ్లి వచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతిని పురసరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ జడ్పీచైర్మన్ హేమలత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ సంక్షేమశాఖ ద్వారా చేతి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
– మదన్రెడ్డి, ఎమ్మెల్యే నర్సాపూర్
ఇతర రాష్ట్రాల్లో ఐడీవోసీలు ఎకడా లేవని, ఒకే దగ్గర ఆఫీసులు మన తెలంగాణలో మాత్రమే ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ కౌడిపల్లి, రామాయంపేట మండలాల్లో డిగ్రీ కళాశాలను మంజూరు చేయడం మన జిల్లా అభివృద్ధికి తారాణమన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ సంకల్పంతోనే నెరవేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ హేమలత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, మెదక్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శని, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఇరిగేషన్శాఖ ఎస్సీ ఏసయ్య, సీపీవో కృష్ణయ్య, ఎస్సీ అభివృద్ధి సంక్షేమాధికారి విజయలక్ష్మి, బీసీ అభివృద్ధి సంక్షేమాధికారి శంకర్ నాయక్, ఏడీ మైనింగ్ జయరాజ్, డీసీవో కరుణ, డీఏవో గోవింద్, ఎక్సైజ్శాఖ సూపరింటెండెంట్ రజాక్, డీఐఈవో సత్యనారాయణ, డీటీవో సాయిలు, డీఎస్వో రాజిరెడ్డి, మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, మెదక్ తహసీల్దార్ కె.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.