తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని మేరీగోల్డ్ హోటల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. సైదిరెడ్డి, బాలమల్లు, జయేశ్ రంజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు అవార్డులు అందజేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన డబ్ల్యూ లక్ష్మణ్ (సీఎన్జీ ఇంజినీరింగ్) సెకండ్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన చొప్పర భాస్కర్రావు (కేబీసీ ఇంజినీరింగ్) థర్డ్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఆద్మ మానుపతి (శ్రీలక్ష్మి ఫాయిల్స్) ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు పొందారు.