చేగుంట, నవంబర్ 16 : ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజుల, జడ్పీచైర్ పర్సన్ రోజాశర్మ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్ రెడ్డి అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా చేగుంట మండల పరిధిలోని చిట్టోజిపల్లి, రెడ్డిపల్లి, పోలంపల్లి, చేగుంట, బీ కొండపూర్ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజుల, జడ్పీచైర్మన్ రోజాశర్మ, సోలిపేట సతీశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నరన్నారు. గతంలో రైతులు కరెంటు, ఎరువులు, విత్తనాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారిని, వ్యవసాయం దండుగా అన్న ప్రభుత్వాలకు సాధించుకున్న తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారన్నారు. రైతు బీమాతో రైతు కుటుంబానికి ప్రభుత్వం పెద్దదిక్కుగా నిలిచిందన్నారు.
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గతంలో చేసిన అభివృద్ధే తప్ప మూడేండ్ల కింద గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు నియోజకవర్గంలో పైసా పనిచేయకుండా జూట మాటలతో ప్రజలను మోసం చేసే ప్రయాత్నం చేస్తున్నారని అన్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరా రు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, వెంకట నర్సింహారెడ్డి, రజనక్ ప్రవీణ్ కుమార్, నాయిని రాజ్గోపాల్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, వంటరి కొండల్రెడ్డి, నారాయణ రెడ్డి, పట్నం తానీషా, జీవన్రెడ్డి, బక్కి రమేశ్, వేణుగోపాల్ శర్మ, అల్లి అంజిరెడ్డి, కార్పొరేటర్ పుష్పానగేశ్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మ్యాకల జయరాములు, సోమ సత్యనారాయణతో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.