వర్గల్, ఏప్రిల్ 7: తలాపునే కొండపోచమ్మసాగర్ ఉన్నా వర్గల్ మండలంలోని చెరువులు,కుంటలు ఎండిపోయాయి. రామాయిపేట కాలువ, హల్దీవాగు పరీవాహక పరిధిలోని ఒకటి రెండు చెరువులు, కుంటలు మినహా మిగతావి ఇప్పుడే కరవు నేలలను తలపిస్తున్నాయి.
మండలంలోని జంగంపల్లి శివారులో సాగునీటిపారుదల శాఖ అధికారుల దృష్టిలోపం, కరెంట్ కోతలు, భూగర్భ జలాలు అడుగంటడంతో చేతికివచ్చిన వరిపొలాలు పశువులకు మేతగా మారాయి. దీంతో రైతుల పరిస్థితి పక్కనే సముద్రం ఉన్నా.. తాగడానికి పనికిరావు అన్నట్లుగా ఉంది.