రామచంద్రాపురం, జనవరి 21 : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పార్లమెంటరీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్రంజన్సింగ్ అలియాస్ లలన్సింగ్ నేతృత్వంలో ఎంపీలు, రాజ్యసభ సభ్యుల బృందం శనివారం సందర్శించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ స్వాగతం పలికారు. అనంతరం కొల్లూర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాజెక్ట్ నమూనాను పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల వివరాలను కమిటీ సభ్యులకు కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, హౌసింగ్ ఓఎస్డీ వివరించారు. పేదలకు సొంతింటి కళను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 124 ఎకరాల్లో 117 బ్లాక్లు, 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందని తెలిపారు.
డబుల్ ఇండ్ల నిర్మాణంలో భాగంగా 20శాతం భూమి ఇండ్ల నిర్మాణానికి, 80 శాతం భూమి ఎమినిటిస్కు కేటాయించిందన్నారు. ఒకేచోట 80వేల మంది నివాసం ఉం డేలా ఇండ్ల నిర్మాణాలు చేపటినట్లు తెలిపారు. రూ.1480 కోట్లతో ప్రాజెక్ట్ని ప్రభుత్వం చేపట్టిందని, ఒక్కో ఇంటికి రూ.8.50లక్షలు ఖర్చు కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఒక్కో ఇంటికి రూ.1.50లక్ష లు కేటాయిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.7.50లక్షలు ఖర్చు చేసిందన్నారు. జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల ను నిర్మించిందన్నారు. ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదర పు అడుగులు ఉంటుందన్నారు. 11కేఎల్ కెపాసిటీ ఉన్న 12 వాటర్ సంపులు, ప్రతి బ్లాక్కు 2 లిఫ్ట్లు, జనరేటర్లు, ప్రతి ఫ్లోర్కు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10.05 కి.మీ తాగునీటి పైప్లైన్, 10.60 కి.మీ అండర్ గ్రౌండ్ పైప్లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాలకు 500 పోల్స్, ఐమాస్ట్ లైటకు 11 పోల్స్, అండ ర్గ్రౌండ్ కరెంట్ కేబుల్ని ఏర్పాటు చేసిందని కలెక్టర్డాక్టర్ శరత్ వివరించారు. 80 శాతం ఖాళీస్థలంలో ఆల యం, పోలీస్స్టేషన్, దవాఖాన, గ్రీనరి, 33కేవీ సబ్స్టేషన్ (1), 11 కేవీ(2)నిర్మాణాలు, పార్కులు, క్రీడా మైదానం, షాపింగ్ కాంప్లెక్స్కు కేటాయించినట్లు తెలిపారు.
డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు 2020లోనే పూర్తి చేశామని, ఆసియాలోనే పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అతి పెద్ద టౌన్షిప్ అని పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యులకు జిల్లా అధికారులు వివరించారు. ఈ ఇండ్లను డీఈసీ ఇన్ఫ్రాస్ట్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించినట్లు తెలిపా రు. డబుల్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన డెమో వీడియోతోపాటు డబుల్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అమోయ్కుమార్, అడిషనల్ కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీపీ శిల్పవల్లి, డీఈసీ ఇన్ఫ్రాస్ట్ట్రక్చర్ సంస్థ ఎండీ అనిరుద్గుప్తా, సీఈవో మధుసూదన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, తహసీల్దార్ జయరాం, ఏసీపీ కృష్ణప్రసాద్, ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, ఆర్ఐ శ్రీకాంత్, సర్వేయర్ ఆనంద్, మాజీ ఎంపీటీసీ నర్సింహ పాల్గొన్నారు.