సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్, మే 7: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలో ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలివస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బస్సుయాత్ర ముగించుకున్న అనంతరం కేసీఆర్ మధ్యా హ్నం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. గుమ్మడిదల నుంచి కేసీఆర్ బస్సుయాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమవుతుంది. గుమ్మడిదల వద్ద సీఎం కేసీఆర్కు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలుకనున్నాయి. కేసీఆర్ బస్సుయాత గుమ్మడిదల నుంచి జిన్నారం మీదుగా పటాన్చెరు పట్టణం వరకు కొనసాగనున్నది. మార్గమధ్యంలో కేసీఆర్ ప్రజలు, రైతులు, యువకులు తదితర వర్గాల వారిని కలిసి మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్ బస్సుయాత్ర పటాన్చెరుకు చేరుకున్నాక పోలీస్స్టేషన్ వద్ద సాయం త్రం కేసీఆర్ రోడ్షో జరుగనున్న ది. కేసీఆర్ రోడ్షోను భారీఎత్తున నిర్వహించేందుకు ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి ఏర్పాట్లు చేసున్నారు. 50 వేల మందితో కేసీఆర్ రోడ్షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. జనవాహినితో రోడ్లన్నీ జనమయం కావడంతో పాటు కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినేందుకు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, నాయకులు రానున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం న ర్సాపూర్ పట్టణానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో (బస్సుయాత్ర) చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణంలోని రెడ్ఫోర్ట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగనున్నది. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల నుంచి ప్రజలను పెద్దసంఖ్యలో రోడ్ షోకి తరలించేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.