మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 6 : జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దీవించి పంపిన తనను జనగామ ఎమ్మెల్యేగా ఓటు వేసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం ధూళిమిట్ట మండలంలోని రెడ్యానాయక్తండా, కూటిగల్, హనుమతండా, దుబ్బతండా, కొండాపూర్, బెక్కల్, బైరాన్పల్లి గ్రామా ల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. జనగామ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే సిద్దిపేట మాదిరిగా జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మీరు చెబుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రూ.72 కోట్లతో కూటిగల్ నల్ల చెరువును అభివద్ధి చేసి, గోదావరి జలాలతో చెరువును నింపి రైతాంగానికి సాగునీరందించనున్నట్లు తెలిపారు. కొండాపూర్ గట్టు మల్లన్న, బెక్కల్ రామలింగేశ్వర ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కొండాపూర్లో సొంత ఖర్చులతో దుర్గమ్మ ఆలయాన్ని నిర్మిస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయనుందని వివరించారు. చేర్యాల ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేక సంతోశ్కుమార్, వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దల పద్మానర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్క నాగరాజుయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు చొప్పరి వరలక్ష్మీసాగర్, వంగ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఆకుల యాదగిరి, సర్పంచులు శివలాల్, దోమ బాలమణీబాలకృష్ణ, జాటోత్ రేణుకాఖల్రాం, సుజాతాశ్రీనివాస్, బాదావత్ రేఖాశ్రీనివాస్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు బర్మ రాజమల్లయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బండి చంద్రయ్య, బీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కర్ర అరుణ, బీఆర్ఎస్వై మండల అధ్యక్షుడు బడుగు సాయిలు, మాజీ జడ్పీటీసీలు నాచగోని పద్మావెంకట్గౌడ్, పేరం భిక్షపతి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాడెం శ్రీనివాస్, శ్రీనివాస్, నాయకులు దుబ్బడు వేణుగోపాల్రెడ్డి, పుట్ట వెంకట్రమణారెడ్డి పాల్గొన్నారు.
ధూళిమిట్ట మండలం ఏడు గ్రామాల్లో బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అభ్యర్థి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయం 9 గంటలకు కూటిగల్ సమ్మక్క-సారలమ్మలను పల్లా రాజేశ్వర్రెడ్డి దర్శించుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రెడ్యానాయక్తండాకు వెళ్లిన పల్లా రాజేశ్వర్రెడ్డికి గిరిజనులు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. కూటిగల్లోకి అడుగుపెట్టిన ఆయనకు రాజేశ్వర్రెడ్డికి మహిళలు బొట్టుపెట్టి బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమ కులస్తులు పల్లాకు గొర్రెపిల్లను బహూకరించారు. కూటిగల్లో వివిధ పార్టీల నుంచి పలువురు, నాయకులు కార్యకర్తలు పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.