సీఎం కృషితో సర్కారు వైద్యం బలోపేతం
ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు మెరుగు
ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్
హుస్నాబాద్ సర్కారు దవాఖానలో ఇన్పేషెంట్లకు భోజన కార్యక్రమం ప్రారంభం
హుస్నాబాద్, జూన్ 24: ప్రజారోగ్య రక్షణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ సర్కారు దవాఖానలో ఇన్పేషెంట్లకు భోజన సదుపాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు దవాఖానలకు కొత్త రూపు వచ్చిందన్నారు. సకల సదుపాయాలు, సౌకర్యాలు, వైద్య వసతులతో ప్రజలు మెరుగైన సేవలు పొందుతున్నారని చెప్పారు. ఒకప్పుడు సర్కారు దవాఖానకు వచ్చేందుకు భయపడిన రోగులు ఇప్పుడు దవాఖానకు వచ్చి క్యూలు కడుతున్నారన్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కృషితో హుస్నాబాద్ దవాఖాన వైద్య విధాన పరిషత్కు మార్చబడి అన్ని రకాలైన వైద్య సేవలు అందేలా తయారైందన్నారు.
సియామ్ పరికరాలతో ఆపరేషన్లు తదితర వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మాతాశిశు సంరక్షణ కేంద్రం 50 పడకలతో నిర్మాణం కాబోతోందని తెలిపారు. ఇప్పటికే దవాఖానకు 5బెడ్లతో కూడిన డయాలసిస్ సెంటర్ మంజూరైందని, అతిత్వరలో సేవలు ప్రారంభమవుతాయన్నారు. అక్కన్నపే మండల కేంద్రంతో పాటు రామవరంలో పీహెచ్సీల ద్వారా ఉచిత వైద్య సేవలందుతున్నాయని తెలిపారు. దవాఖానలోని రోగులకు మూడు పూటలా పౌష్టికాహారం అందించేందుకు డైట్ కార్యక్రమం ప్రారంభించామన్నారు. అంతకుముందు దవాఖానలో రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారికి స్వ యంగా భోజనం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, కౌన్సిలర్లు బోజు రమారవీందర్, బొజ్జ హరీశ్, శంకర్రెడ్డి, సూపరింటెండెంట్ డా క్టర్ రమేశ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సౌమ్య, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఎండీ అన్వ ర్, చిట్టి గోపాల్రెడ్డి, ఆకుల వెంకట్, లక్ష్మణ్నాయక్, బొల్లి శ్రీనివాస్, బండి పుష్ప, సారయ్య, విజయభాస్కర్, ఇంతియాజ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కు అందజేత…
పట్టణానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మెడవేని రాజు ఇటీవల ప్రమాదంలో మృతిచెందగా, ఆయన భార్య రాధికకు ఎమ్మెల్యే బీమా చెక్కును అందజేశారు. హుస్నాబాద్ సర్కారు దవాఖాన ఆవరణలో రూ.2లక్షల చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 49వేల మంది కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉన్నారని, వీరందరికీ బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.