రామాయంపేట, నవంబర్ 4: అభివృద్ధిని చూసి ఓటేయాలని, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట బల్దియాలోని కోమటిపల్లి, రామాయంపేట గిరిజన తండా, కోమటిపల్లి గిరిజన తండాతోపాటు గోల్పర్తి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మొదటగా గొల్పరి గ్రామానికి రావడంతోనే వేలాదిగి జనం వచ్చి పద్మాదేవేందర్రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడకు వచ్చిన వారంతా మేమంతా పద్మక్క మనుషులమే.. మమ్మల్ని విడదీయడం ఎవరితరం కాదు అని మహిళలు తేల్చి చెప్పారు.
మీ పద్మక్కను ఆదరించండి, అండగా ఉండి, మీకు న్యాయంం చేస్తానని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి, గిరిజన తం డా, రామాయంపేట గిరిజన తండా, కోమటిపల్లి గిరిజన తండాతోపాటు గోల్పర్తి గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్పరి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు. మహిళలతో కలిసి బతుకమ్మ, కోలాటం ఆటలు ఆడారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు యువకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రామాయంపేట గిరిజన తండాలో సేవాలాల్ మహరాజ్ ఆలయంలో మొక్కులు చెల్లించారు. గిరిజన మహిళలతో కలిసి గిరిజన వేషధారణలో ఆడిపాడారు. కోమటిపల్లి గిరిజన తండాలో అంతే ఉత్సాహంగా గ్రామస్తులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి పక్షాలను నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్కే ఓటేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తండాలను పంచాయతీలుగా మార్చామని, ప్రతి తండాకు రోడ్డు సౌకర్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించామన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని, ఓట్ల కోసం వచ్చే వారి మాటలు నమ్మద్దని అన్నారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ పార్ ప్రవేశ పెట్టిన ఎన్నికల వాగ్ధానాలన్నీ నేరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ చైర్మన్ సరాఫ్ యాదగరి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, రామాయంపేట మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, మల్యాల కవిత, సుందర్సింగ్, చిలుక గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్రెడ్డి, మల్యాల కిషన్, శ్యాంసుందర్, చింతర యాదగిరి, గొల్పర్తి యాదగిరి, డైరెక్టర్లు చింతల రాములు, మర్కు దత్తు, కో-ఆప్షన్ మెంబర్ బాలుగౌడ్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.