‘సమర్థ నాయకుడిపైనే దేశ అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటుంది.. సమస్యను అర్థం
చేసుకొని పరిష్కరించే నాయకుడుంటే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాలకూ మేలు చేకూరుతుంది. ఇప్పుడు దేశానికి ఇలాంటి నాయకుడు, నాయకత్వమే కావాలి. ఇది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. అందుకు నిదర్శనమే ఎనిమిదేండ్ల పాలన’ అని ఉద్యోగ, ఉపాధ్యాయ వివిధ వర్గాలు ముక్తకంఠంతో అంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు ఎంతో మేలు జరిగింది. దేశంలో ఏ ప్రభుత్వాలు పెంచని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో జీతాలు పెంచి ఉద్యోగులకు అండగా నిలిచింది. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్తోనే తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అదే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే దేశం రోల్మోడల్గా మారుతుందని అంటున్నారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని అప్పుడే ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు అందరికీ మేలు జరుగుతుందంటున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఆయనకు చరిత్ర ఉంది.. అనుకున్నది సాధించే పట్టుదల ఉంది.. సాధించింది చక్కబెట్టడం ఆయనతోనే అవుతుంది.. ఉద్యోగుల బాంధవుడు ఆయన.. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 43శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ఆయనది.. అన్ని వర్గాల ఉద్యోగుల శ్రేయస్సు కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్యోగులు, నిరుద్యోగులకు మేలు జరుగుతుంది’.. అని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ముక్తకంఠంతో అంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రజలు, ఉద్యోగులు బలంగా ఆకాంక్షిస్తున్నారు. భారతదేశంపై పూర్తి అవగాహన ఉన్న నేత కావడం, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు కావడం, ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసి యావత్తు దేశానికి ఆదర్శంగా నిలపడంతో దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నది. ఒక వర్గం అని లేకుండా సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పాటు పడుతున్న నేత కేసీఆర్ కావడంతో ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదురించే దమ్మున్న నేత కేసీఆర్ అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ఉద్యోగులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు ఎంతో మేలు జరిగింది. దేశంలో ఏ ప్రభుత్వాలు పెంచని విధంగా తెలంగాణ రాష్ట్రం పెద్ద మొత్తంలో జీతాలు పెంచి ఉద్యోగులకు అండగా నిలిచింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 42 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల అందరికీ 43శాతం ఫిట్మెంట్ను ఇచ్చింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పెద్దఎత్తున ప్రమోషన్లు వచ్చాయి. అనంతరం మొదట పీఆర్సీ కమిటీ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఈ కమిటీ 7.5 శాతం పీఆర్సీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేసి, రాష్ట్ర శాసనసభలోనే పీఆర్సీని 30శాతాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఇలా ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. ఇంత సాహసం చేసి ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును కూడా 58 ఏండ్ల నుంచి ఏకంగా 61 ఏండ్లకు పెంచారు.
జాబ్ క్యాలెండర్.. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఎన్నడూ.. ఎప్పుడూ వేయని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్నది. రాష్ట్రంలో 90వేలకు పైగా వివిధ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడలేదని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు. మొన్నటి వరకు 310జీవో మీద రాద్ధాంతం చేసిన ప్రతిపక్షాల విమర్శలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సమధానం ఇచ్చారు. ఎన్నో ఏండ్ల నుంచి చాలీచాలని జీతాలతో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో వాళ్లంతా సంబురంగా తమ పని తాము చేసుకుంటున్నారు. విద్య, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థకు తీసుకురావడంతో నిరుద్యోగులకు వరమైంది. కొత్త జోనల్ విధానం మేరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేలా, ఎప్పటికప్పుడు ఉద్యోగాల నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ను ప్రభుత్వం తయారు చేస్తున్నది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేశారు. దీంతో కొత్త జిల్లాలతో పాటు డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయి. గతంలో రెండు జోన్లుగా ఉన్న రాష్ర్టాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా మార్చింది. దీంతో జిల్లాస్థాయి నుంచి మల్టీ జోన్ వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతున్నాయి. మిగిలిన 5శాతం పోస్టులను ఓపెన్ కోటాలో ఉంటాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే, ఆ జిల్లా కింద పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త జోనల్ విధానం ద్వారా గతంలో ఉన్న వైశాల్యం తగ్గుతుంది. దీంతో స్థానికంగానే ఉంటూ వారి జోన్ పరిధిలోనే ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే సౌలభ్యం ఇవాళ ఏర్పడింది. గతంతో పోల్చితే నూతన జోనల్ విధానం ద్వారా జిల్లాలో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఉద్యోగులకు సైతం భారీ లబ్ధి చేకూరింది. ఇలా అన్ని వర్గాల ఉద్యోగుల శ్రేయస్సు కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని అప్పుడే ఉద్యోగులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందంటున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదే మంచి సమయం
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి ఇదే మంచి సమయం. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. దినదినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ వైపు దేశ ప్రజలంతా చూస్తున్నారు. మాకు కూడా ఇలాంటి పథకాలు ఉంటే బాగుండు అంటూ, కేసీఆర్ నాయకత్వం కావాలంటున్నారు.
– బజారు ప్రశాంత్గౌడ్, ప్రభుత్వ ఉద్యోగి, నిజాంపేట
జాతీయ రాజకీయాల్లోకి రావాలి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. కోట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిండు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయితనే మంచిగా పాలన చేస్తారని ప్రజలంతా ఓట్లేసి గెలింపించిండ్రు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపట్టిన అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఒంటెద్దు పోకడలతో కేంద్రంలో పాలన చేస్తున్న మోదీ మెడలు వంచడం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే దేశం బాగుపడుతది.
– పూర్ణచందర్, రైతు, ఖలీల్పూర్
దేశం బాగుండాలంటున్న సీఎం
75 ఏండ్ల చరిత్రలో ఏ పార్టీలు ప్రవేశపెట్టని పథకాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ రోజు ఉద్యోగులు బాగున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాతే. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారంటే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిదర్శనం. సీఎం కేసీఆర్ సేవలు రాష్ర్టానికే కాదు, ఇప్పుడు దేశానికి కూడా అవసరం. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ను ఎలా అందిస్తున్నారో దేశంలో కూడా ఉచిత విద్యుత్ను అందించే శక్తి కేసీఆర్కే ఉంది.
– దొంత నరేందర్, సీనియర్ అసిస్టెంట్, ఇరిగేషన్ శాఖ మెదక్
దేశరాజకీయాల్లో పెనుమార్పు
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే దేశరాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. తెలంగాణలో అన్నిరంగాలు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం లబ్ధిపొందారు. జాతీయ పార్టీ ఏర్పాటుతో అన్నిరంగాల వారికి లబ్ధిచేకూరుతుంది. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ పథకాలు దేశమంతా అమలు అవుతాయి.
– రాజు, ఐకేపీ సీసీ, కంగ్టి
యువకుల చూపు కేసీఆర్వైపు
దేశ వ్యాప్తంగా యువకులు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ విభాగం అభివృద్ధి చేయడంతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. దేశానికి కేసీఆర్ లాంటి నాయకుల అవసరం ఉంది, ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– పవన్కుమార్గుప్తా, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు, శివ్వంపేట
దేశ ప్రజలకు ఎంతో మేలు
దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న మోదీ పాలనకు తగిన బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే. బీజేపీ పాలన కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నట్లు ఉన్నది. తెలంగాణ మాదిరిగానే మిగతా రాష్ర్టాల ప్రజలకు మేలు జరగాలంటే అది ఒక్క సీఎం కేసీఆర్తోనే సాధ్యం.
– మణిక్యం కురుమ, చిరు వ్యాపారి, రాయికోడ్
దేశం గర్వించదగ్గ పనులు
దేశ రాజకీయాలకు కేసీఆర్ అవసరం ఉన్నది. ప్రశ్నించే గొంతులేక కేంద్రం ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నది. గుజరాత్కు చెందిన మోదీ ప్రధాని అయినప్పుడు తెలంగాణ సీఎం పీఎం కాకూడదా. తెలంగాణకు చెందిన పీవీ గతంలో పీఎంగా పని చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ ఇటీవల చేసిన ఉచిత కరెంట్ ప్ర కటన కేంద్రంలో ప్రకంపనలు సృష్టించింది.
– హనుమంతురావుపాటిల్, వ్యాపారి, ధర్మాపూర్, రాయికోడ్
దేశంలో కొత్త ఒరవడి
తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దారు. దేశంలో కొత్తఒరవడి కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యం. రైతులను మోసం చేసే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే అది కేసీఆర్తోనే సాధ్యం. ఆయన పాలన వస్తేనే దేశంలోని ప్రజలు, రైతులు సుఖసంతోషంగా ఉంటారు. – సిద్ది మాణిక్ ప్రభు, రైతు, పుల్కల్ గ్రామం
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రా వాలి. ఆయన దేశానికి దిక్సూచిలా ఉం టాడు. మన రాష్ట్రంలో అమలువుతున్న పథకాలు దేశంలో అమలైతే బడుగు, బ లహీన వర్గాల బతుకులు బాగుపడుతా యి. దేశ నాయకత్వాన్ని కేసీఆర్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.
– బీమరి నర్సింలు, రిటైర్డ్ టీచర్, ఔరంగాబాద్, మెదక్ అర్బన్