మర్కూక్, నవంబర్ 4 : రాష్ర్టానికే మర్కూక్ మండలం ఆదర్శమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. మర్కూక్ మండలంలోని పాములపర్తి, మర్కూక్, బావానందాపూర్, శివారువెంకటాపూర్, దామరకుంట, కాశిరెడ్డిపల్లి గ్రామాల్లో శనివారం సీఎం కేసీఆర్కు మద్దతుగా రోడ్డుషో నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణలో అమలు చేస్తామంటున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆపార్టీ నాయకులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా, 24 గంటల విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా ప్రజలు ఆలోచని చేయాలన్నారు. సీఎం కేసీఆర్ను గెలిపిస్తే రాష్ట్రంతో పాటు గజ్వేల్ నియోజకవర్గం మరింత
అభివృద్ధి చెందుతుందన్నారు.
మండలం ఏర్పాటుతోనే మర్కూక్ అభివృద్ధి సాధించి, రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఐదు జిల్లాలకు సాగునీరు అందించే కొండపోచమ్మ ప్రాజెక్టు మం డలంలో నిర్మించడం మన అదృష్టమన్నారు. శనివారం మండలంలోని పాములపర్తి, మర్కూక్, బావానందాపూర్, శివారువెంకటాపూర్, దామరకుంట, కాశిరెడ్డిపల్లి, గ్రామాల్లో ప్రజాప్రతినిదులతో కలిసి కేసీఆర్కు మద్దతుగా బైక్ ర్యాలీగా వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, మరింత అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలన్నారు. కాం గ్రెస్ నాయకులు తెలంగాణలో అమలు చేస్తామంటున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎం దుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరు కల్లబొల్లి మాటలు చెబుతున్నారో సంక్షేమ పథకాలను ఎవరు అమలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.
మూడు గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా.. 24 గంటల విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ను గెలిపిస్తే రాష్ట్రంతోపాటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతున్నదన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, కొందరు నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరుతున్నారన్నారు. అంతకుముందు పాములపర్తి, అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు మహిళలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, హరిపంతులు, ఎంపీటీసీల ఫో రం అధ్యక్షుడు కృష్ణయాదవ్, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి మేకల కనకయ్య, పిట్ల సత్యనారాయణ, కనకయ్య, కరుణాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.