మెదక్ అర్బన్, మే19: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 4,22,418 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,00,752 మంది పురుషు లు, 2,21,666 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు 39,251 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 39,490 మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చా రు. శుక్రవారం 80వ రోజు 29 బృందాలు 3579 మందికి కంటి పరీక్షలు చేశారు. 301 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 403 మంది కోసం ఆర్డర్లు పెట్టినట్లు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 9506 మందికి పరీక్షలు
సంగారెడ్డి, మే 19 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా అంతటా నిర్వహించిన శిబిరాల్లో 9506 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 4653 మంది పురుషులు, 4853 మంది మహిళలు ఉన్నారు. గ్రామాల్లోని 7556 మం ది, పట్టణాల్లోని 1725, జీహెచ్ఎంసీలోని 225 మందికి కంటి పరీక్షలు చేశారు. 218 పురుషులు, 262 మంది మహిళలకు కండ్లద్దాలు అందజేశారు. 432 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశారు. కంటి సమస్యలు ఉన్న 367 మంది పురుషులు, 369 మహిళలకు కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యు లు సూచించారు.