మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 3,49,124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,65,519 మంది కాగా, మహిళలు 1,83,605 మంది ఉన్నారు. 34,368 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 33,583 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 63వ రోజు బుధవారం 31 బృందాలు పాల్గొన్నాయి.
మొత్తం 4510 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 317 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే 335 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ చందునాయక్ తెలిపారు. 63 రోజుల్లో 3.49 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.