చేగుంట, జనవరి 21 : కంటి వెలుగు దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట, నార్సింగి మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నార్సింగి మండలం వల్లూర్లో బీజీపీ యూత్ సభ్యులు ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వాహేద్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం, అన్ని కులమతాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. శివాలయాన్ని సందర్శిం చి అక్కడ హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. అనంతరం చిందం సత్తమ్మకు రూ.60వేల చెక్కును ఎంపీ అందజేశారు. బీంరావ్పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నార్సిం గి మండలాధ్యక్షుడు మైలరాం బాబు, ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎర్రం అశోక్, బీఆర్ఎస్ నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్, కాపు ఎల్లమ్మ, రాజేశ్, భూపతి, ఎంపీడీవో ఆనంద్ మేరీ, వైద్యులు రవికుమార్, అనిల్కుమార్, సర్పంచ్లు ఆనందాస్ మహేశ్వరి నరేశ్, కాశబోయిన భాస్కర్, మోహన్, సొసైటీ చైర్మన్లు వంటరి కొండల్రెడ్డి, మ్యాకల పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంటలో రెండు ప్రాథమిక హెల్త్ సెంటర్లకు ఎంపీ భూమిపూజ చేశారు. అనంతరం రాంపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి, కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలు అందజేశారు. దీంతో పాటు క్రీడా ప్రాంగణం, బోనాల్ గ్రామంలో ముదిరాజ్ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు దేశానికే ఆదర్శమన్నారు.