రామాయంపేట/ చిలిపిచెడ్/ చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 1 : ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని, కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. రామాయంపేట మున్సిపల్లోని 3వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ప్రారంభించి, అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు సుకేషిని, హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, మేనేజర్ శ్రీనువాస్, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, పీహెచ్ఎన్ఎం సత్తమ్మ, సూపర్వైజర్ సునంద, నాయకులు పుట్టి యాదగిరి, మల్యాల కిషన్, దేవుని రాజు, చింతల యాదగిరి, అనిల్, ఎమ్మార్పీలు మర్కు లావణ్య, లావణ్య, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిలిపిచెడ్ మండల కంటి వెలుగు వైద్యాధికారి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చండూర్, చిట్కుల్ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు జితేందర్, తిరుపతి, సిబ్బంది శశిధర్రెడ్డి, మజీనా బేగం, మాధురి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం పద్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తు న్నారని బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సూచించారు. చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ ప్రసాద్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.