మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు ఈ శిబిరాల్లో పాల్గొని ఇప్పటి వరకు 74,742 మందికి కంటి పరీక్షలు చేశాయి. 10,272 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశాయి.
9571 మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. బుధవారం 6618 మందికి కంటి పరీక్షలు చేశారు. మరో 664 మందికి అద్దాల కోసం రెఫర్ చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ తెలిపారు.