అల్లాదుర్గం, జనవరి 30 : దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు నేరుగా లబ్ధిదారులకు అందేది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైనా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. నాలుగు సంవత్సరాల కాలంలో అల్లాదుర్గం మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 7.56 కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు.
పేదల కోసమే ‘కంటి వెలుగు’
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు. కంటి చూపు లేని జీవితం అంధకారమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పల్లెల్లోనే కంటివెలుగు కార్యక్రమం ద్వారా పరీ క్షలు చేసి, ఉచితంగా కళ్లద్దాలు అందిస్తుందన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానల్లో చికిత్స పొంది న 12మందికి సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లెగడ్డ నర్సింహులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అంజియాదవ్, తహసీల్దార్ తులసీరాం, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
నిరుపేద తల్లిదండ్రులకు వరం..
నిజాంపేట, జనవరి 30 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి పథకం’ ఆడపిల్లల నిరుపేద తల్లిదండ్రులకు వరమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేటలో రూ. 16లక్షల నిధులతో మంజూరైనా ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం నందిగామ, నిజాంపేట, కల్వకుం ట, రజాక్పల్లి, తిప్పనగుల్ల, బచ్చురాజ్పల్లి గ్రామాలకు చెంది న 36మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ఆడపిల్లలు కల్యాణలక్ష్మి పథకానికి అర్హులు అవుతారని, ఈ పథకంతో బాల్య వివాహాలకు చెక్ పడిందన్నారు.
దృష్టి లోపాల నివారణకు సీఎం కేసీఆర్ రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రతి పల్లెలో వైద్యసిబ్బంది పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయా గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజాంపేటలో పీహెచ్సీ నిర్మాణంతో మండల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, తహసీల్దార్ గంగాప్రసాద్, ఆర్ఐ యూసుఫ్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, డైరెక్టర్ కిష్టారెడ్డి, మం డల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, నాయకులు ఉన్నారు.