బీఆర్ఎస్ సర్కారు మారగానే సిద్దిపేట జిల్లాలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటుతుండగా.. చెరువులు, కుంటలు, వాగులు ఎండిపోతున్నాయి. అనధికార కరెంట్ కోతలు, బోరుబావుల్లో నీటిమట్టం పడిపోతుండడంతో యాసంగి పంటలు కాపాడుకోవడానికి రైతులు ఆందోళన చెందవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న గత ఐదారేండ్లుగా ఎండాకాలం రాకముందే కాళేశ్వర జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు నింపడంతో రైతులకు సాగునీటి కష్టాలు తలెత్తలేదు. ఫలితంగా గుంట ఎండిపోకుండా పంటలు పండాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలం చేశారు. రైతులకు పుష్కలంగా సాగునీరు అందించడంతో భూమికి బరువయ్యేలా పంటలు పండించారు. ఉచిత కరెంట్, రైతుబంధు వంటి ప్రభుత్వ చేయూతతో కర్షకులు హాయిగా ఎవుసం చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. రైతుబంధు పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఈసారి యాసంగి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీరందించలేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు దిగులు పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో రంగనాయక, మల్లన్నసాగర్, కొం డపోచమ్మ రిజర్వాయర్లు నిర్మించారు. వీటికి తోడు అన్నపూర్ణ, తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్, తపాస్పల్లి రిజర్వాయర్, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేశారు. ఏటా యాసంగి సాగుకు పుష్కలంగా గోదావరి జలాలను గత కేసీఆర్ ప్రభుత్వం అందించి రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడింది. ఈ ఏడాది యాసంగికి సాగునీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత మంత్రికి ఫోన్చేసి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీటిని విడుదల చేయాలని విన్నవించడంతో పాటు స్వయంగా ఉత్తరం రాశారు. ఫలితంగా హరీశ్రావు చొరవతో సాగు నీటిని ఎట్టకేలకు గత నెల 24న జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ నీటిని విడుదల చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ఒత్తిడితో ఎట్టకేలకు మల్లన్నసాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ఇటీవల కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసిన అధికారులు కొండపోచమ్మ నుంచి హల్దీవాగుకు ఇంకా నీటిని విడుదల చేయలేదు. రంగనాయకసాగర్ నుంచి అన్ని ప్రాంతాలకు నీరు వెళ్లకపోవడంతో చెరువులు నెర్రెలు బారుతున్నాయి. నారాయణరావుపేట మండలంలోని కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి చెరువులు ఎండిపోయాయి. వీటితోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటుతున్నా యి. బావుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. హల్దీవాగులోకి నీటిని విడుదల చేస్తే సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు కామారెడ్డి జి ల్లా రైతులకు ఎంతో ప్రయోజనం ఉండేది. ఇటు చేర్యాల ప్రాంతానికి తపాస్పల్లి నీటిని విడుదల చేయలేదు. లద్నూర రిజర్వాయర్ పరిస్థితి అంతే..తోటపల్లి రిజర్వాయర్, శనిగరం ప్రాజెక్టుల కింద పరిస్థితులు అంతే అని చెప్పాలి. హుస్నాబాద్ ప్రాంతానికి గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి నీటిని అందించా లి. అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ గురించి ముం దుకు వెళ్లడం లేదు. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కాళేశ్వరం జలాలు పరుగులు పెట్టాయి. నేడు ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు కనిపిస్తున్నాయి.
ఐదారేండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాలో రైతులు మళ్లీ బావుల పూడికతీత పనులు షురూ చేశారు. జిల్లాలో చాలాచోట్ల బావులలోతు చేసేందుకు క్రేన్లను ఫిట్ చేస్తున్నారు. గత యాసంగి సాగుచేసిన దానికంటే తక్కువగానే పంటలు సాగుచేశారు.ఉన్న పంటలను కాపాడుకుందామంటే అప్పుడే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, బావుల పూడికతీత పనులకు శ్రీకారం చుట్టినట్లు రైతులు చెప్పారు.
మాకు మూడెకరాల వ్యవసా య పొలం ఉంది. చెరువుల్లో నీళ్లు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కాల్వల ద్వారా మా ఊరి చెరువులోకి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పం ట పొలాలు ఎండిపోతుంటే బా ధగా ఉంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఎదురైంది. దయచేసి మా చెరువుల్లోకి నీళ్లు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.