పేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. చేగుంట మండలపరిధిలోని ఉల్లి తిమ్మాయిపల్లి, అనంతసాగర్, రాంపూర్, గొల్లపల్లి, గొల్లపల్లి గిరిజన తండాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో వారికి ఘన స్వాగతం పలికారు.
చేగుంట, నవంబర్13 : పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరంపల్లిలో చేగుంట మండల పరిధిలోని ఉల్లి తిమ్మాయిపల్లి, అనంతసాగర్, రాంపూర్, గొల్లపల్లి, గొల్లపల్లి గిరిజన తండాలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, రైతు బంధు ఇచ్చి రైతులకు మేలు చేశారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదంటి ఆడబిడ్డలకు మేలు చేశారని, దేశంలో ఎక్కడాలేని విధంగా మిషన్భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగు నీటిని అందించి నీటి గోస తీర్చారని అన్నారు.
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధే తప్ప మూడేండ్ల కింద గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు నియోజకవర్గంలో పైసా పనిచేయకుండా ఝూట మాటలతో ప్రజలను మోసం చేసే ప్రయాత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, వెంకట నర్సింహరెడ్డి, సుభాష్రెడ్డి, రజనక్ ప్రవీణ్కుమార్, నాయిని రాజ్గోపాల్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, వెంకట్రెడ్డి, బుడ్డ భాగ్యరాజ్, అయిత పరంజ్యోతి, వంటరి కొండల్రెడ్డి, నారాయణరెడ్డి, పట్నం తానీషా, సర్పంచ్లు వెంకటేశంగారి లక్ష్మీసిద్ధ్దిరాములు, సత్తెమ్మ,ప్రశాంత్, జనార్దన్రెడ్డి, మోహన్రెడ్డి, సాయికుమార్, సుదర్శన్, స్వామి, సంతోశ్ కుమార్, ఎంపీటీసీలు గణేశ్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చేగుంట, నవంబర్ 13 : అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు అండగా ఉంటానని, బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉన్నదని చేగుంట మండలం కసాన్పల్లి మాజీ ఉప సర్పంచ్ నాగులు అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమంతోనే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా కొత్త పృథ్వీరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నట్లు నాగులు తెలిపారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, వెంకట నర్సింహరెడ్డి, సుభాష్రెడ్డి, రజనక్ ప్రవీణ్ కుమార్, నాయిని రాజ్గోపాల్, వెంకట్రెడ్డి, బుడ్డ భాగ్యరాజ్, అయిత పరంజ్యోతి, వంటరి కొండల్రెడ్డి, నారాయణరెడ్డి, పట్నం తానీ షా, శ్రీకాంత్, సంతోశ్ కుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.