మెదక్ : దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు సోమవారం పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దళితుల కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు.
పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, ఖాజాపూర్ ఎంపీటీసీ బాచూపల్లి యాదగిరి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఇమ్మడి నరేష్, ఉప సర్పంచ్ అరికేల శ్రీహరి, సీనియర్ నాయకులు, మెట్టు గణేష్, చిటుకుల శేషాద్రి, గందే శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.