జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల మండలం నాగపురి, గుర్జకుంట, కడవేర్గు
గ్రామాల లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కారు అందజేత
చేర్యాల, జూన్ 24 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దళితబం ధు పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నాగపురి, గుర్జకుంట, కడవేర్గు గ్రామాలకు చెం దిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గుర్జకుంట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మండల అధ్యక్షుడితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్లు, కార్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దళితలందరికీ ప్రభు త్వం దళితబంధు అందజేస్తున్నదన్నారు.
దశల వారీగా లబ్ధిదారులు ఎంపిక ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ము స్త్యాల బాల్నర్సయ్య, సర్పంచ్ల ఫోరం మం డల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, సర్పంచ్ చీపురు రేఖ, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ ము స్త్యాల కిష్టయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, టీఆర్ఎస్వై నాలుగు మండలాల ఇన్చార్జి శివగారి అంజయ్య, శనిగరం లక్ష్మణ్, ఆకుల రాజేశ్, పెంబర్ల రాజశేఖర్, రణం ప్రశాంత్గౌడ్ పాల్గొన్నారు.