టేక్మాల్, నవంబర్ 24: కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అంధకారం అవుతుందని అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి, బర్ధిపూర్, దాదాయిపల్లి, మల్కాపూర్, ధనూర, పాల్వంచ, శేరిపల్లి, ఎలకుర్తి గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణను చీకటి రాజ్యంగా మారుస్తారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రజల జీవన విధానం మారిందన్నారు. నాటి తెలంగాణను ప్రస్తుత తెలంగాణను చూసి ప్రజలు ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్నే గెలిపించుకోవాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నదన్నారు. కాపీ కొట్టే ప్రభుత్వం వద్దు, ఆచరణలో చూపే ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ రైతులు సుఖంగా ఉండాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు 3 గంటల కరెంట్ చాలు అన్న కాంగ్రెస్ రైతుల భూములను బీడుగా మార్చడానికే చూస్తున్నదన్నారు. అలాంటి కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. తిరిగి తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకాలు ఇలాగే పొందాలని, అందుకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి తెలంగాణ తెచ్చిన కేసిఆర్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు. అనంతరం తంపూలూర్ గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు 30 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు సాయిలు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్వేతా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముఖ్తార్, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీటీసీ బాలయ్య, తదితరులు ల్గొన్నారు.