‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సమైక్యపాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగునీరు, ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చుతుంటే.. రేవంత్ మాత్రం అపరిమిత విద్యుత్ వద్దంటూ ప్రేలాపనలు చేయడంపై భగ్గుమన్నారు. రైతులను మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టేలా మాట్లాడిన తీరుపై మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. రాస్తాకోలు, ర్యాలీలు తీసి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ దిష్టిబొమ్మలను ఊరేగించి తగులబెట్టారు. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొని రైతు వ్యతిరేకి రేవంత్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో పాటు రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– మెదక్ /సంగారెడ్డి జిల్లా నెట్వర్క్, జూలై 12
రైతాంగానికి క్షమాపణ చెప్పాలి
సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందజేస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రైతులకు ఉచితంగా 3 గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతది అనడం సిగ్గుచేటు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహకారం అందించలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని రైతులు సుఖసంతోషాలతో బతుకుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పంటలను అధిక దిగుబడి సాధించి ఇప్పుడిప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రైతులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి.
-జాదవ్ కిరణ్, జీర్గితండా కంగ్టి
కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది..
రైతులకు ఉచిత కరెంట్ను తగ్గించాలని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన మాటలను ఖండిస్తున్నాం. కాంగ్రెసోళ్లకు రైతులేనిదే రాజ్యం లేదని తెలియదా.. రైతుల జోలికొస్తే పుట్టగతులుండవు. సీఏం కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నది చూసి ఓర్వలేకనే, రైతులపై మోసపూరితంగా మాట్లాడడం రైతులోకం ఖండిస్తుంది. నిజమైన రైతుబిడ్డవైతే రైతులకు క్షమాపణ చెప్పాలి. అనుచిత వాఖ్యలను వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.
-అమ్మగారి రవీందర్రెడ్డి, రైతు, గుమ్మడిదల మండలం
రైతు ద్రోహి కాంగ్రెస్..
కాంగ్రెస్ రైతు ద్రోహి అని మరోసారి నిరూపితమైంది. గతంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారు. ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి నిరీక్షించిన రోజులు ఉండేవి. ఉచిత కరెంట్ అంటూ అర్థరాత్రి కరెంట్ సరఫరా చేయడంతో రైతులు రాత్రిల్లో పొలాల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు 3గంటలు కరెంట్ చాలని మాట్లాడడం దుర్మార్గం. రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కస్సుని వెళ్లగక్కాడు.
-శ్రీనివాస్రెడ్డి రైతు, తెల్లాపూర్, ఆర్సీపురం
కాంగ్రెస్ ప్రజావ్యతిరేకి..
కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజా వ్యతిరేక విధానాలతోనే కాలం గడుపుతున్నది. దశాబ్దాల కాలంగా చూస్తు వస్తు న్నాం.. ఇంకా ఆ పార్టీలో మార్పు రాలేదు. రాదు కూడా.. ఎంత మంది ఆ పార్టీలోకి వలస వచ్చినా వారి రక్తంలోనే వ్యతిరేకత పారుతోంది. వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పదవి నుంచి తొలిగించాలి.
-పల్లె జితేందర్గౌడ్, పురపాలిక చైర్మన్ రామాయంపేట
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతే సంగతులు
ఒక పక్క తొమ్మిదేండ్ల నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఆదు కుంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంటే సీఎం కేసీఆర్పై బురద జల్లే మాటలు మాట్లాడితే జనాలు మెచ్చుకుంటారని మాట్లాడున్న రేవంత్రెడ్డికి త్వరలోనే రైతులు బుద్ధి చెబుతారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీఎం కిరణ్ కుమార్రెడ్డి కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నారు. ఇప్పుడు అదే కక్షతో రేవంత్రెడ్డి రైతులకు 3గంటలు కరెంట్ చాలనడం సిగ్గుచేటు.
వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు సరైన బుద్ధి చెప్పాలి. అప్పుడే వారు మట్లాడే మాటలకు తగిన శిక్ష. ఒకవైపు రాష్ర్టానికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ రైతులకు మంచి పథకాలు, ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే కండ్లు మండి మాట్లాడుతున్న రేవంత్రెడ్డిని హైదరాబాద్ నుంచి తరిమి కొట్టాలె. ఒక్కడిని తరిమి కొడితే మళ్లీ ఇలాంటి మాటలు ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడు.
-సార్గు భాగయ్య, రామాయంపేట
తెలంగానోళ్లను అవమానిస్తుండ్రు..
కాంగ్రెసొళ్లకు పదేండ్లుగా అధికారం లేదు. కక్షలతో ఇట్ల మాట్లాడుతుండ్రు. వీల్ల సంగతి ఎలక్షన్లో చూపిద్దాం. సీఎం కేసీఆర్ సార్ రైతులకు బాధ కలుగకుండా 24 గంటల కరెంట్ ఇస్తుంటే వీల్ల కండ్లు మండి 3 గంటలు ఇస్తే సరిపోతుందని అంటుండ్రు. మీ సంగతి ఎలక్షన్లలో చూపిస్తం.
-గొల్పర్తి బాబు, రైతు, రామాయంపేట
రేవంత్ నోరు జాగ్రత్త..
రేవంత్ నోరు పారెసుకోకు.. నీ జాగిరనుకున్నవా 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతదంటున్నవ్. నువ్వు ఎవు సం చేయ్ తెలుస్తది. కేసీఆర్ సార్ రైతులను కడుపులో పెట్టుకుని సూస్తుండు. నీకు ఎవుసం ఎట్ల చేయాలో చూ పిస్తం.. అడ్డం దిడ్డం మాట్లాడం తగదు. ఎవుసం చేసేటోనికి తెలుస్తది.. ఎవుసం విలువ నీకేం తెలుస్తది. రైతు లకు క్షమాపణ చెప్పాలి..
– టంకరి స్వామి, రైతు, రామాయంపేట