వెల్దుర్తి, ఏప్రిల్ 12 : ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తానికి గురైన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంగళపర్తికి చెందిన చాకలి సాయిలు తన భార్య నాగమణి, కూతురు మహేశ్వరి కుమారుడు సాయిరామ్(17)తో కలిసి హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వెళ్లాడు.
కూతురు వివా హం నిశ్చయం కావడంతో కొద్ది రోజుల క్రితం గ్రామానికి వచ్చా డు. ఇంటి మరమ్మతులతో పాటు వివాహ పనులు చేసుకుంటున్నాడు. అతని కుమారుడు సాయి రామ్ ఇంటర్ మొదటి సంవత్స రం ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.