మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులోకి గురువారం 11లక్షల14వేల చేప, రొయ్య పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మత్స్యసొసైటీలు ఏర్పాటు చేసి ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయడంతో పాటు అవి పెద్దయ్యాక విక్రయించుకునేందుకు మోపెడ్, బొలేరో, డీసీఎం వంటి సంచార వాహనాలను సబ్సిడీపై అందజేస్తున్నారన్నారు. ఏటా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నదని, దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
-సిర్గాపూర్, సెప్టెంబర్ 7
సిర్గాపూర్, సెప్టెంబర్ 7: మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో 11 లక్షల 14 వేలు చేప, రొయ్య పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు ఉన్న గ్రామాల్లో మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసి, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ఉచితంగా చేప, రొయ్య పిల్లలు వదులుతున్నట్లు తెలిపారు. తర్వాత పెరిగిన చేపలు పట్టేందుకు వలలు, రవాణాకు మోపెడ్, బొలేరో, డీసీఎం వంటి వాహనాలను మత్స్య సహకార సొసైటీకి ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయానికి అనుబంధ రంగాలైన పాడి, మత్స్య తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గొలుసు కట్టు చెరువులను కాకతీయులు నిర్మింపజేశారన్నారు.
సీఎం కేసీఆర్ అదే తరహాలో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపొందించి, గొలుసు కట్టు చెరువుల పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాల్లో మిషన్ కాకతీయ కింద చేపట్టిన పనులతో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయన్నారు. చేపల పెంపకానికి చెరువులు, కుంటలు మత్స్యకారులకు ఉపయోగానికి రాగా, ఆ జలాలు రైతుల పంటల సేద్యానికి సద్వినియోగం అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రమావత్ రాంసింగ్, జడ్పీటీసీ రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండు వెంకటరాములు, సర్పంచ్ గంగామణి నర్సింలు, ఎంపీటీసీ ప్రేమల తదితరులు పాల్గొన్నారు.