అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్లో నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణం, జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు ప్రభుత్వ పాఠశాలలంటే పెచ్చులూడిన కప్పులు, బురదమయమైన ప్రాంగణాలు ఉండేవని, నేడు సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం పోటీలు పడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారన్నారు. సిద్దిపేటలో నాడు 9 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే నేడు 33 పాఠశాలలు ఏర్పడ్డాయన్నారు. నాడు పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులుంటే నేడు 20 వేల మంది చదువుకుంటున్నారన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మంత్రి హరీశ్రావు ఆత్మీయంగా ముచ్చటించారు.
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 9: అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్లో నూతనంగా రూ.3 కోట్లతో నిర్మించిన క్రీడా ప్రాంగణం, జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను కలలుగన్న విధంగా ఈ పాఠశాల, కళాశాల సమూదాయన్ని తీర్చుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాడు ప్రభుత్వ పాఠశాలలంటే పెచ్చులూడిన కప్పులు, బురదమయమైన ప్రాంగణాలు ఉండేవి. కానీ నేడు సీఎం కేసీఆర్ హయాంలో మన ఊరు మన బడితో అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలను రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.
రూ.5 కోట్లతో డైనింగ్ హాల్, టాయిలెట్లు, క్రీడాప్రాంగణం గల ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల ఎడ్యుకేషన్ హబ్ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ చెత్త ఏరివేసి స్వచ్ఛసిద్దిపేట కోసం ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని.. పాఠశాల ప్రాంగణాన్ని కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే ఉంచాలన్నారు. తాము కష్టపడి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దామని.. దీనిని కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం పోటీలుపడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారని.. అందుకే సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి పాఠశాల, ఇందిరానగర్ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు బాలికల ఎడ్యుకేషన్ను కూడా ఎంతో అభివృద్ధి చేశామని.. ఫలితాల కోసం కూడా అలాగే కృషి చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు రావడంపై అభినందనలు తెలిపారు. అలాగే పదోతరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధిస్తే ఆపిల్ ఐపాడ్ బహుమతిగా అందిస్తానన్నారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల్లో అన్ని ఉచితంగా ఇవ్వడంతోపాటు నాణ్యమైన విద్య అందించడంతో చాలామంది విద్యార్థులు చేరుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 5 సంవత్సరాలుగా పదోతరగతి ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. గతేడాది 97.85 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. ఈ ఏడాది 98.65శాతం ఉత్తీర్ణత సాధించి ద్వితీయస్థానంలో నిలిచారన్నారు. విద్యార్థుల కోసం మెస్చార్జీలు భారీగా పెంచినట్లు తెలిపారు. 8వ తరగతి వరకు రూ.700 నుంచి రూ.1200, 8 నుంచి 10 వరకు చదివే విద్యార్థులకు రూ.850 నుంచి రూ.1400కు పెంచామన్నారు. సిద్దిపేటలో నాడు 9 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే నేడు 33 పాఠశాలలు ఏర్పడ్డాయన్నారు. నాడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులుంటే నేడు 20 వేల మంది చదువుకుంటున్నారన్నారు. అన్ని మండలకేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 80 జిల్లా పరిషత్ పాఠశాలలకు రూ.50 వేల విలువగల స్పోర్ట్స్ కిట్లను అందిస్తున్నామన్నారు. దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెత్త బయ ట వేయకుండా చెప్పాలని మంత్రి సూచించారు.
ఆత్మీయంగా… విద్యార్థులతో మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట బాలికల విద్యాసముదాయం ప్రారంభోత్సవంలో పాఠశాల విద్యార్థులతో మంత్రి హరీశ్రావు ఆత్మీయంగా ముచ్చటించారు. సూల్ ఎలా ఉంది.. సిద్దిపేట అభివృద్ధిలో ఏది బాగుంది. రన్నింగ్లో ప్రైజ్ తెచ్చుకుంటారా.? మంచిగ చదువుకొని భవిష్యత్తులో ఏం అవుతారు అంటూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషంగా తమ సమాధానాలను వేదికపై నుంచి చెప్పేశారు. అస్మా అనే విద్యార్థి మా సూల్ని బాగా చేశారు సర్.. బహుత్ అచ్చాహై సార్. మేము బాగా చదువుకొని మంచి పేరు తెస్తాం. సిద్దిపేటలో అన్ని బాగున్నాయి సర్.. కోమటి చెరువు.. క్రికెట్ స్టేడియం ఇలా అన్ని బాగున్నాయి అని చెపుతూ వచ్చింది. అభినయ అనే మరో విద్యార్థిని సూల్ బ్యూటీఫుల్గా ఉంది అంటూ.. సూల్ నచ్చిందని నేను ఇంట్లో ఉండకుండా హాస్టల్లో ఉండి చదువుతున్న సర్ అని చెప్పింది… నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇకడ చదువుతున్న సార్ అని భవ్యశ్రీ అనే విద్యార్థిని చెప్పింది. సూల్… గ్రౌండ్ బాగున్నాయి అంటూ చెప్పింది.. ఇలా కాసేపు విద్యార్థులతో మంత్రి హరీశ్రావు ముచ్చటించడంతో మిగితా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు.
సంతోషంగా ఉంది: వేలేటి రోజాశర్మ
సకల సౌకర్యాలతో కూడిన అద్భుతమైన బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ క్రీడా ప్రాంగణాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం గొప్ప విషయమన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
మంత్రి హరీశ్రావు ఏ శాఖ చేపట్టినా అద్భుత ఫలితాలు: రావుల శ్రీధర్రెడ్డి
పెద్దనగరాల్లో మాత్రమే ఉండే విధంగా సిద్దిపేటలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడంపై ఒక క్రీడాకారుడిగా ఎంతో ఆనందంగా ఉందని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనాయకుడు సీఎం కేసీఆర్ ఎలాగైతే రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నారో.. వారి అడుగుజాడల్లో మంత్రి హరీశ్రావు కూడా ఏ శాఖ చేపట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. రూ.5 కోట్లతో బ్రహ్మాండమైన బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ తీర్చిదిద్దినట్లు తెలిపారు. సౌకర్యాలు కల్పించడం కంటే దాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఇంత మంచి క్రీడాప్రాంగణం తీర్చిదిద్దడంలో తనకు భాగస్వామ్యం కల్పించిన మంత్రి హరీశ్రావు, సిద్దిపేట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్పోర్ట్స్ కిట్లను మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పయ్యావుల పూర్ణిమ ఎల్లం యాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.