జిన్నారం, జనవరి 21: నియోజకవర్గంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజల సహకా రం, ప్రజాప్రతినిధుల ప్రణాళికలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. మండలంలోని అండూరు, సోలక్పల్లి, ఊట్ల, జిన్నారం, గడ్డపోతారం గ్రామాలలో రూ.2.35కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. గడ్డపోతారంలో హెటిరో పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో రూ. 2.70కోట్లతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డపోతారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు గ్రామాలకు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. గడ్డపోతారంలో మినీ స్టేడియాన్ని ప్రారంభించి క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మ న్ ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెం కటేశంగౌడ్, సర్పంచులు ప్రకాశ్చారి, చెట్టి శివరాజ్, ఖదీర్, కొరివి ఆంజనేయులు, శ్రీకాంత్రెడ్డి, రేఖాకృష్ణ, లావణ్యాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు స్వాతీప్రభాకర్రెడ్డి, ఆకుల భార్గవ్, జనాబాయి, సంతోషామహేశ్, ఉప సర్పంచులు మమతాపెంటేశ్, సంజీవ, రవీందర్, వనజాకృష్ణారెడ్డి, అభిలాశ్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, హెటిరో పరిశ్రమ డైరెక్టర్లు మోహన్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రవిబాబు, సీఎస్ఆర్ ప్రతినిధి సుధాకర్, రఘునాథ్, మాజీ ఎంపీటీసీ బాశెట్టిరాజు, మాజీ సర్పంచ్ నీరుడి శ్రీనివాస్, వేణుగోపాల్, సంధ్యగారి నర్సింగ్రావు, సార నరేందర్, ప్రభాకర్రెడ్డి, నాగ రాజు, రామకృష్ణ, లక్ష్మణ్రావు, ఎన్కుమార్, బీమ్రావు, గణేశ్, ఈవో వెంకట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.