బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో మండల పరిధిలోని రాజ్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మనియార్పల్లికి చెందిన కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిన్నారం మండలం ఊట్ల యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు.
– జహీరాబాద్/ మెదక్ రూరల్/ జిన్నారం, సెప్టెంబర్ 28