కల్హేర్, నవంబర్ 23: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేయూతనందిస్తున్నారని జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ గుర్ర పు సుశీలఅంజయ్య తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఆయా చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీబీపేట్లోని రామేశ్వరం చెరువులో 84వేలు, కృష్ణాపూర్లోని పెద్దచెరువులో 60వేలు, మార్ది పెద్ద చెరువులో 39 వేల బొచ్చ, మృగాల, రవుట చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులకు పూర్వవైభవం తీ సుకురావడంతో చెరువులు, కుంటల్లో నీరు నిల్వ శాతం పెరిగిందన్నారు. మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, వలలు, తూకం యంత్రాలు, చెరువుల్లో పెంచిన చేపలను విక్రయించుకునేందుకు ఆటోలను మత్స్యకారుల సంఘాలకు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మత్స్యకారులను కోరారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు రాం సింగ్, సర్పంచులు రవీందర్రెడ్డి, కిష్టారెడ్డి, కుమ్మరి బాగ మ్మ, నాయకులు అంజయ్య సాగర్, జలందర్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, శ్రీను, పాంగురంగారెడ్డి, మత్స్యశాఖ ఇన్చార్జి ఏడీఏ శివప్రసాద్, సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.
హత్నూర, నవంబర్ 23: హత్నూర మండలం రెడ్డిఖానాపూర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడుగా లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు అశోక్, కార్యదర్శి రవీందర్, డైరెక్టర్లు యాదయ్య, రవీందర్, వినీత్, వీరేశం విష్ణువర్ధన్, ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఎన్నికల అధికారి నవీన్కుమార్ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మత్స్యకారులు పాల్గొన్నారు.