ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు.
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట,అక్టోబర్ 17 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన వినతులు, ఫిర్యాదులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలన్నారు. భూసంబంధిత సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు, ఆసరా, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 67 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్లో ప్రజావాణి
సిద్దిపేట పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజవాణి నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 3 ఫిర్యాదులు రాగా, శానిటైషన్కు సంబంధించి -1, తాగునీటి సరఫరాకు సంబంధించి-2 వినతులు వచ్చాయన్నారు. వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఆర్వో శ్రీకాంత్, ఏఈలు మహేశ్, యాదగిరి, శ్రీకాంత్, రంజిత్, హరితహారం అధికారి అయిలయ్య, శానిటరీ ఎస్సైలు గోపయ్య,సతీశ్, టీపీఎస్ దేవరాజు పాల్గొన్నారు.