పటాన్చెరు టౌన్, మే 19: మహిళా సంఘాల బ్యాంకు రుణాల పంపిణీలో గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన టార్గెట్ను మించి రుణాలను అందజేసినందుకు పటాన్చెరు ఏపీఎం శ్రీనివాస్రావు అవార్డు దక్కింది. గురువారం నగరంలోని జూబ్లీహిల్స్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరై స్వయం సహాయక బృందాలకు, ఐకేపీ అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. పటాన్చెరులో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్రావు 2021-22కు ఇచ్చిన రూ. 48కోట్ల టార్గెట్కు గాను రూ. 60కోట్లను మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందేలా కృషి చేశారు. టార్గెట్కు మించి ప్రతిభను చాటినందుకు ఏపీఎం శ్రీనివాస్రావును అభినందిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అవార్డును అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఐకేపీ బృందం అద్భుతమైన ప్రతిభను చాటి మహిళలను వారి సొంత కాళ్లపై నిలబడేలా రుణాలను అందజేసి ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. సంగారెడ్డి జిల్లా నుంచి చక్కటి ఫలితాలను ఇచ్చారని వారిని అభినందించారు. పటాన్చెరు మహిళా స్వయం సహాయక సంఘాలు శ్రీనివాస్రావును అభినందించాయి.
అవార్డు రావడంపై హర్షం
సంగారెడ్డి అర్బన్, మే19:ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహిళా సమాఖ్య లింకేజ్ ద్వారా ఉత్తమ సేవలు అందించినందుకు గాను రాష్ట్ర స్థాయి అవార్డు రావడంపై బ్యాంకు ఉద్యోగులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం సంగారెడ్డి బ్యాంకులో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బ్యాంకు సీఈవో శ్రీనివాస్ను ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మ న్ చిట్టి దేవేందర్రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు.