టేక్మాల్, నవంబర్ 18 : పదేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని తిరిగి కనుమరుగు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని చంద్రు తండా, లక్ష్మణ్ తండా,అచ్చన్నపల్లి, హసన్ మహ్మద్పల్లి గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, రైతుల జీవన విధానం కాంగ్రెస్కు నచ్చకనే మోసపూరిత హామీలు ఇస్తున్నదని, హామీలు నమ్మి ఓటు వేస్తే అభివృద్ధి కనుమరుగవుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ కష్టా లు మరువలేనివని గుర్తు చేశారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా, కొన్నేండ్లుగా సాగు చేస్తున్న పోడు భూములను సైతం తిరిగి గిరిజనులకు చెందేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.
చంద్రు తండాలోని గిరిజన మహిళలు అందోల్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి సాంప్రదాయ నృత్యాలు చేయగా, ఎమ్మెల్యే వారితో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి అచ్చన్నపల్లి గ్రామం వరకు అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థ్ధి చంటి క్రాంతి కిరణ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని యువత చంద్రుతండా నుంచి అచ్చన్నపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అచ్చన్నపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట మండలాధ్యక్షుడు బీఆర్ఎస్ భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్, ఎంపీపీ చింత స్వప్న రవి,ఎంపీటీసీ మోహన్, సర్పంచ్లు స్రవంతి సర్దార్, కవిత అశోక్, లావణ్య రెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విక్రంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజాగౌడ్, జోగిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు నాయికోటి భాస్కర్, సాయి లు, ఎంపీటీసీలు, నాయకులు జైపాల్ రెడ్డి, ముఖ్తార్, మామిడి సుధాకర్ రెడ్డి, సలీం, సిద్ధ్దయ్య తదితరులు పాల్గొన్నారు.