హుస్నాబాద్టౌన్, ఫిబ్రవరి 3: సమ్మక్క, సారలమ్మ జాతర దగ్గర పడుతుండటంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం జనసంద్రంగా మారుతున్నది. బంగారం(బెల్లం) కొనుగోలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్య లో తరలివస్తుండటంతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఈనెల 21 నుంచి 24వతేదీ వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్నది.
హుస్నాబాద్ పట్టణంలోని పలు దుకాణాల వద్ద ఎత్తు బంగారం (అమ్మవార్లకు బెల్లం నైవేద్యం) ఇస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంటున్నది. మహిళలు, పురుషులు, పిల్లలు తమ నిలువెత్తు బంగారాన్ని తూకం వేయించుకుంటున్నారు. రెండేండ్లకు ఒకసారి జరిగే జాతరకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమవుతున్నారు.