హుస్నాబాద్, మే 9: ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ ఇంగ్లిష్ మీడియంలో 1000/986 మార్కులు సాధించి స్టేట్ 8వ ర్యాంకు, జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించగా మంగళవారం సాయంత్రం హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అశ్వితను అభినందించారు. అశ్వితతో పాటు ప్రిన్సిపాల్ను శాలువాలతో సన్మానించారు.
రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు సాధించిన గుంటిపల్లి అశ్వితను మంత్రి తన్నీరు హరీశ్రావు ఫోన్లో అభినందించారు. క్యాంపు కార్యాలయంలో అశ్వితను అభినందించిన అనంతరం ఎమ్మెల్యే సతీశ్కుమార్ మంత్రి హరీశ్రావుకు ఫోన్ చేసి విద్యార్థిని అశ్విత సాధించిన ర్యాంకు గురించి తెలియజేశారు. అశ్వితకు ఫోన్ ఇవ్వమని చెప్పిన మంత్రి ఆమెను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, అశ్విత తండ్రి గుంటిపల్లి అజయ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు బీలూనాయక్, ఆకుల వెంకట్, విజయభాస్కర్, బొల్లి శ్రీనివాస్, మ్యాక నారాయణ, ఇంతియాజ్ పాల్గొన్నారు.