హుస్నాబాద్టౌన్, జనవరి 5: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా 2022కు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ను హుస్నాబాద్ మున్సిపాలిటీ దక్కించుకున్నది. హైదరాబాద్లో నిర్వహంచిన పట్టణ ప్రగతి వర్క్షాప్లో ఈ సర్టిఫికెట్ను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ సుంకె రాజమల్లయ్యకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం అందజేశారు. టాయిలెట్ల నిర్మాణం, వాటి పరిశుభ్రత, నిర్వహణ, సెప్టిక్ ట్యాంక్లను క్లీన్ చేయించడంతో పాటు ప్రజలు మరుగుదొడ్లను ఉపయోగించేందుకు కృషి చేయడంతో ఓడీఎఫ్ ప్లస్ ప్లస్కు హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎంపికైనట్లు కమిషనర్ రాజ మల్లయ్య తెలిపారు. ఈ సర్టిఫికెట్ దక్కించుకోవడంపై మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితతోపాటు కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేశారు.
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి..
గజ్వేల్, జనవరి5: కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరాలుగా మార్చడానికి నిర్వహిస్తున్న పోటీలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ప్లస్ గుర్తింపు పొందింది. 2022-23 సంవత్సరానికి గాను ఓడీఎఫ్ పోటీ కోసం కేంద్రప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. దీనిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ప్లస్ గుర్తింపును సాధించింది. ఈ మేరకు గురువారం హైద్రాబాద్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ విద్యాధర్కు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామ్మెల్ఖాన్ పాల్గొన్నారు.