మెదక్ రూరల్, మే24 : మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో శతాధిక వృద్ధురాలు గోపని ఎల్లమ్మ (102) సోమవారం రాత్రి మృతిచెందింది. గోపని ఎల్లమ్మ భర్త భూమయ్య 39 ఏండ్ల కిత్రం మరణించారు. ఆమెకు ఐదుగురు కూతుర్లు. కూతుళ్లందరి పెండ్లిలు చేసింది.
మనవళ్లు, మనమరాళ్లు, మునిమనవళ్లు, ముని మనమరాళ్లు మొత్తం 102మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ ఏడాది మార్చి 27న 102 పుట్టినరోజును జరుపుకొన్నది. ఎల్లమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.