న్యాల్కల్, డిసెంబర్ 27 : స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక స్వామి 223వ జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భా రీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని రంగురంగుల పూ లతో అందంగా అలంకరించారు. కంచి కామకోటి పీఠం, ఆల య కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 221 ఆవర్తన గణపతి అధర్వశీర్ష పురస్పర విశేష ఫలపంచామృతాభిషేకం, హోమాల పరిసమాప్తి, పూర్ణాహుతి, మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గర్భగుడి నుంచి యాగశాల వరకు స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మం త్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మకమిటీ చైర్లన్ పెంటారెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజార్షిషా, సీఈవో ఎల్లయ్య, ఝరాసంగం మండలం బర్ధిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ తదితరులు ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారందరూ ఆలయం, యా గశాలలో సిద్ధివినాయక స్వామివారికి ప్రత్యే క పూజలు చేశారు.
నేడు కల్యాణం…
బుధవారం ఉదయం రేజింతల్ ఆలయ ప్రాంగణం లో స్వామివారికి అభిషేకం, 9 గంటలకు సిద్ధి, బుద్ధి సమే త సిద్ధివినాయక స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తా రు. మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రేజింతల్ అశోక్, అల్లాడి నర్సింలు తెలిపారు. భక్తుల అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అల్లాడి వీరేశం, కమిటీ సభ్యులు నీల రాజేశ్వర్, బస్వరాజ్, చిద్రి లక్ష్మణ్, రవికుమార్, కల్వ చంద్రశేఖర్, రాజేశ్వర్, రాజ్కుమార్, మేనేజర్ కృష్ణ, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.