సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో మేడ్చల్ మలాజ్గిరి జిల్లాలోని ఐదు ల్యాండ్ పార్సిల్స్ ప్రీ బిడ్ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) కె.గంగాధర్ భూముల వివరాలు, ఆన్లైన్లో విక్రయ సమాచారాన్ని వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం మండలంలో 2 చోట్ల ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. మలాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో 4, ఘట్కేసర్ మండలంలో 1 చొప్పున ఉన్నాయన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలో 16, ఆర్సీ పురం మండలంలో 6, జిన్నారంలో 1 చొప్పు న ఉన్నాయన్నారు. సమావేశంలో మేడిపల్లి తహసీల్దార్ మహిపాల్రెడ్డి, హెచ్ఎండీఏ డీఏవో శోభారాణి, డిప్యూ టీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.