అక్కన్నపేటలో రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలిని ఢీకొట్టిన డీసీఎం.. చికిత్స పొందుతూ మృతి
రామాయంపేట: రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామంలోని రైల్వే గేటు వద్ద వృద్ధురాలిని డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రామాయంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కమలాపూర్కు చెందిన మల్లమ్మ(60) అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రైలు దిగి భిక్షాటన చేసుకుంటూ కాలినడకన వెళ్తున్నది.
ఈ క్రమంలో రామాయంపేట నుంచి మెదక్ వైపునకు వేగంగా వెళ్తున్న డీసీఎం ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను 108 అంబులెన్స్లో రామాయంపేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు పరశురాములు ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు రామాయంపేట ఎస్ఐ రాజేశ్ తెలిపారు.