సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 28: సంగారెడ్డి జిల్లాలో నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నందున అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 2.30కు కంది మండలం కాశీపూర్లో నిర్మించనున్న బసవ భవన్కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 3.30కు సదాశివపేట మున్సిపాలిటీలోని సిద్దాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం 5.30కు న్యాల్కల్ మండలంలోని కాకిజన్వాడకి చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 6 గంటలకు న్యాల్కల్ మండలం రాఘవపూర్లో జరుగుతున్న గరుడ గంగ మంజీరా కుంభమేళాకు మంత్రి హాజరవుతారని కలెక్టర్ శరత్ వెల్లడించారు. సాయంత్రం 6.30 గంటలకు మంత్రి హైదరాబాద్కు బయలుదేరనున్నారు.